Search This Blog

Monday, May 5, 2008

dharmayudhdham

ఒక నెల దాటాక మళ్ళీ మిత్రుల్ని కలుస్తున్నాను. ఈ నెలలో మా పెద్దబ్బాయి ఈ వూరినించి రిలొకేట్ అవడం ఒక కారణమయితే కోడలూ మనవడి బాధ్యత కూడా కొంత కారణం. విజయనగరం గురించి ఇంక ప్రత్యేకంగా గుర్తు తెచ్చుకుని రాయడంకన్నా విశాఖకి దూకడమే బాగుంటుందని భావన. ఈ లోగా మా శాస్త్రి గురించి ఒక మాట. శాస్త్రి మా కన్నా ఒక సంవత్సరం సీనియర్. బి యే చదివే వాడు. మా వూరిలో పెద్ద లాయరు గారి అబ్బాయి. మాకిద్దరికీ క్రికెట్ గ్రౌండు మీదా వరహాలు ద్వారానూ పరిచయం. మేం బి ఎస్ సీ చదివే రోజులంటే 1982 చైనా యుధ్ధం రోజులు. రోజూ రేడియో లో యుధ్ధం వార్తలు వచ్చేవి.శాస్త్రీ వాళ్ళింట్లో ఒక రోజు వార్తలు అందరూ శ్రధ్ధగా వింటుంటే వాడికి అనుమానం వచ్చింది.నిన్న రాత్రి అని వార్తల్లో యేదో చెప్పారు. వాళ్ళ నాన్న గారినే అడిగాడు.నాన్నా రాత్రి పూట కూడా యుధ్దం చేస్తారా అని. ఆయన కూడా అంతే సీరియస్ గా లేదురా నాన్నా ధర్మయుధ్ధం. ఆరింటికల్లా శంఖం వూదేస్తారు అని చెప్పారు. అవాక్కవడం శాస్త్రివంతూ నవ్వుల్ని ఆపుకోడం మా వంతూ

No comments: