Sunday, March 30, 2008

hindiitelugu

హిందీకి అంతగా ప్రాచుర్యం లేని వూళ్ళలో హిందీ సినిమా చూడడం ఒక తమాషా అనుభవం.ఒక సారి విజయనగరంలో ముఘల్ యె ఆజం సినిమా చూస్తున్నాము. మొదటిసారి రిలీజయినప్పటి సంగతి. పృధ్వీరాజ్ కపూర్ గంభీర కంఠంతో తహ్ లియా అని గర్జించాడు. మా ముందు కూర్చున్న ఇద్దరిలో ఒకడు యేటన్నాడురా అని అడిగేడు. యేట్నేదురా అని విదిలించుకున్నాడు రెండోవాడు. సందేహం తీరకపోతే మనసూరుకోదు కదా ! మళ్ళీ అడిగేడు. యేటన్నాడురా అని. ఈ సారి కొంచెం అసహనంగా. మరేట్నేదురా , ఆళ్ళందర్నీ దెం......మన్నాడు!!! ఇలాగే మరోసారి వో కౌన్ థీ చూస్తున్నాము. సినిమా అయిపోయే దగ్గరిలో మా ముందువాడు అతిసంతోషంగా అదీ అని అరిచేడు. పక్కవాడితో చెప్పాడు. తెలిసిపోనాదిరా . ఈ బొమ్మలో సాధనా డబల్ ఫొటో యేసినాది.

0 comments: