Search This Blog

Friday, March 23, 2007

kirlampudicricket2

మరొ సంవత్సరం క్రికెట్ మాచ్ గురించి చెప్పే ముందు ఒక సంగతి చెప్పాలి. మిత్రులందరమూ కలిసి యెవరినైనా మోత మొయ్యాలంటే వాళ్ళనే కెప్టెన్ చెయ్యడం ఆనవాయితీ గా వుండేది.కొంత మంది అది వారి ప్రజ్ఞా పాటవాలకూ ప్రాముఖ్యతకూ గుర్తింపు అని భ్రమ పడడమూ కద్దు. మరి అందుకే కదా వారిని మోసేది. యిలాంటి కెప్టెన్ల లో మాధవరావు ఒకరు .యింకో సంగతి యేమంటే ఉదయం బాటింగ్ చెసే టీము లో చేరి మధ్యాహ్నం ఫీల్డింగు యెగగొట్టడం కూడా మామూలే.మాధవరావు టాస్ వేసి గెలిచినట్టుగా థంస్ అప్ సిగ్నలు ఇచ్చాడు. [డ్రింక్ కొత్తదయినా సిగ్నల్ పాతదే] వెంటనే గబగబా వెళ్ళి వెంకట రామశాస్త్రి మాధవరావు టీము లో తన పేరు రాసేసాడు. తీరా మాధవరావు మళ్ళీ పెవిలియన్ లోకి వచ్చాక తెలిసింది. అతను అతి తెలివి ప్రదర్శించి ఫీల్డింగ్ తీసుకున్నాడని. మాచ్ చిన్నదైనా కామెంటరీ వగైరాలన్నీ వుందేవి. ముసిముసి నవ్వుల కామెంటేటర్ మాధవ రావుని అడిగేడు . మీరు ఫీల్దింగ్ తీసుకున్నారు. పిచ్ యెలా వుంటుందని భావిస్తున్నారు అని. మధ్యాహ్నం మేటనీ పోయినందుకు ఉక్రోషం లో ఉన్న వెంకటరామశాస్త్రి మైకు లాక్కుని "పిచ్చి ముదిరింది " అన్నాడు.

No comments: