Search This Blog

Wednesday, March 19, 2008

kaamaakshi

విజయనగరం ముగిద్దామనుకుంటే అలలు అలలుగా ఇంకా ఉన్నాం మా సంగతేమిటంటున్నాయి. మరి విశాఖ వెనక పడుతోందంటే నీ తోనే ఉందిగా అని ఇకిలిస్తున్నాయి. మధ్యలో కంచి యాత్రొకటి. చెన్నై నించి కంచికి వెళ్ళడం ఒక పెద్ద ప్రణాళిక అయిపోయింది. అంత చిక్కులతో ఉందని నేననుకోలేదు. అంత మరీ ప్రాచుర్యం లేదా అంటే మరి హోటళ్ళన్నీ నిండుగానే ఉన్నాయి.రైలేదీ లేదు లోకల్ తప్ప. బస్సెక్కాలంటే మరో వూరెళిపోవాలన్నారు. సరే అని టాక్సీ లో వెళ్ళాము. ఆటో యెక్కి కామాక్షి సన్నిధికెళ్ళాము.అంతా మరిచిపోయాను. ఆమె వదనం చూసి.ఆమె యెవరు? తల్లా , సోదరా , మిత్రురాలా, ప్రేమికా. యేమి ఆ ఆత్మీయత!యేమి ప్రశాంతత. జీవితం ధన్యమయిందనిపించింది. యీ విషయాలు మరో చోట. విజయనగరం గురించి రాస్తూ పంచాయతనేశ్వర్ సంగతే యెత్త లేదని గుర్తొచ్చింది. ఎన్ సి సి అండర్ ఆఫీసర్ గా అతను రూట్ మార్చ్ లీడ్ చేసుకుంటూ వెళుతుంటే అందరం ముగ్ధులమై చూసే వాళ్ళం . అప్పట్లో ఎన్ సీ సీ యూనిట్లతో పాటు మిలిటరీ ఆఫీసర్లు ఉండేవారు. ట్రైనింగ్ ఇవ్వడానికి. వాళ్ళ స్నేహం ప్రభావమో,సొంత తెలివో గాని పంచాయతనేశ్వర్ కూడా గెడ్డం పెంచి సర్దార్జీ లాగానే వుండేవాడు. బి కాం చదివే వాడు.యెర్రని మనిషి నిలువెత్తు విగ్రహం . ఇప్పుడేం చేస్తున్నాడో తెలీదు మరి . యెవరికైనా తెలుసా? ఇంకా సారధి గురించి రేపు రాస్తాను.

No comments: