Search This Blog

Saturday, June 16, 2007

apputachchulu

అప్పుతచ్చుల గురించి నన్ను మెలుకొలిపిన s గారు ఇంకో విధంగా నన్ను కొంచెం పెద్ద ముల్లుతోనే పొడిచారు. ద్వివేదుల విశాలాక్షి గారిని విషాలాక్షి అని రాసి రాక్షసమంత్రి విషకన్యను కనులముందు ఆడించారు. విశాలాక్షి గారు కాశీ విశాలాక్షి లాగానే అమృతమయి. ఆమె కళ్ళు విషాలు చిమ్మడం ఊహించుకోడమే కష్టం. ఒక్క కీ తేడాతో యెంత ప్రమాదం జరిగిపోయింది. ఇక మీద ఒళ్ళు దగ్గిర పెట్టుకుంటాను.నన్ను ఇలాంటి ప్రమాదాలనుంచి జాగరూకుణ్ణి చేసిన మిత్రుడికి కృతజ్ఞుణ్ణి. నరసింగరావు గారూ కుటుంబమూ అమెరికా వెళ్ళిన రోజుల్లో ఆ ఇంటిలో ఆచార్య కొత్తపల్లి వీరభద్రరావు గారు వుండేవారు. తరువాతి రోజుల్లో ఆయన చాలా లబ్ధప్రతిష్థులయ్యారు. విజయనగరం మహారాజా కాలేజి లో ఆయన చెరేనాటికే ఆయనకు డాక్టరేటు వుండేది. అది చాలా అరుదైన విషయమని వేరే చెప్పక్కరలేదు. అయినా అప్పటీ ఆయన చిన్న వయసును దృష్తిలో పెట్టుకుని కొంతమంది ఆయనను బచ్చా మేష్టరు అని ముద్దుగా పిలుచుకునే వారు. ఈ మాటరాసి యెవరినైనా నొప్పించివుంటే క్షంతవ్యుణ్ణి. వీరభద్రరావు గారి సతీమణి రాయప్రొలు సుబ్బారావు గారి కుమార్తె. కధల్లొ రాస్తూ వుంటారు- యేడు మల్లెల యెత్తు రాకుమారి అని. ఆ మాట సాక్షాత్కరించినట్టు వుందే వారు. అంతటి సౌకుమార్యం ఆరోజు నించి నేతిదాకా యెక్కడా నేను చూడలేదు.వారి యింతిలోనే వారి మెనల్లుళ్ళు ఇద్దరు వుండి చదువుకుంటుండేవాళ్ళు. చిన్నవాడు ఆనందమోహన్ ఫిఫ్తు ఫారం లో నా సహాధ్యాయి. అతని అన్న కాలేజి లో చదివే వాడు. వారిద్దరికి వడ్రంగం అంటే అభిరుచీ మంచి నిష్ణాతులు కూడానూ. ఇమంతిలో పుస్తకాల షెల్ఫులూ తబుళ్ళూ వాల్లే చేసే వాళ్ళు. ఇది కొంత విచిత్రం గానే వుండేది.తరువాత వీరభద్రరావు గారు హైదరాబాదు వెళ్ళిపోయారు. తాజాకలం: మిత్రుడు లంబోదర్ నా చందమామ జ్ఞాపకాలు చదివి నేను సైతం అన్నారు. ఇలాగే చందమామ ప్రేమికుల్లో మద్దిపత్ల నాగేస్వరరావును చెప్పుకుని తీరాలి. కిర్లంపూది హాస్తల్లో మాతో పాటు వుండేవాడు. ఫార్మసీ అధ్యాపకుడు. అతని వద్ద చిన్నప్పటి నించి అన్ని చందమామలూ బైండు అయి వుండేవి.

No comments: