Search This Blog

Thursday, October 7, 2010

ఇంకా ఎన్నెన్నో

కాన్వొకేషన్ లాగే మరో ముఖ్యమైన ఘట్టం ఎన్నికలు. పార్టీలు ప్రవేశించి ప్రతిష్ఠ దిగజార్చకముందు చాలా ఆనందదాయకమైన సమయం. పానెళ్ళని ఎన్నుకునేవాళ్ళం. పానెల్ లో అద్యక్షునిగా నిలబడే వాళ్ళకి వక్తృత్వ పోటీలు జరిగేవి. మంచి వక్తలే నిలబడే వారు మామూలుగా. ఎన్నికవడానికి ఆ డిబేటే ప్రధానంగా వుండేది. ఆంధ్రా యూనివర్సిటీ అద్యక్షులుగా ఎన్నికైన వారు ఐ ఏ ఎస్ వంటి వాటికీ లేదా ఇతర వున్నత పదవులనీ అధిష్టించడం మామూలే హెచ్ జె దొర ,వ్యాస్ వంటి ఐ ఏ ఎస్ అధికారులూ,భాస్కరప్రసాద్ వంటి ఐ ఏ ఎస్ ఆఫీసర్లూ అందరినీ మించి ప్రసన్నకుమార్ గారి వంటి విజ్ఞులూ ఆ జాబితాలో వున్నారు. ఎంత జనం వెనక వున్నా మంచి వక్త కాకపోతే ఎన్నికవడం దాదాపు అసాధ్యమే. అన్ని కాలేజీలూ కలిసి వుండడంతో ఆ రోజుల్లో ఇంజనీరింగ్ వాళ్ళూ సైన్స్ వాళ్ళూ అద్యక్షపదవికి అంతగా ఆసక్తిచూపేవారు కాదు.మహా అయితే బాగుండదని జాయింట్ సెక్రెటరీ గా వుండే వాళ్ళు. దీనితో పాటు హాస్టళ్ళ ఎన్నికలు కూడా కేతిగాడిలా వుండేవి. వాటిలో కూడా అన్ని సబ్జెక్ట్ల వాళ్ళూ కలిసే వుండడంతో మజాగానే వుండేది. . ఇక్కడ ఒక మాట చెప్పాలి. లిటరరీ అండ్ కల్చరల్ అసోసియేషన్ అనేది ఒకటి వుండేది. దానికి లిటరరీ అండ్ కల్చరల్ అసాసినేషన్ అనె ముద్దుపేరుతో పిలుచుకునే వాళ్ళం. మరిప్పుడేమనాలో తెలీటంలేదు.

No comments: