Search This Blog

Thursday, August 2, 2007

mr college contd

వరసగా రెండు గదులుంటాయని చెప్పానుకదా. అందులో రెండో గది లోనే మాకు క్లాసులు యెక్కువగా అయ్యేవి. ఇంకో దాంట్లో మరో సెక్షను వాళ్ళకి అయ్యేవి. ఎంపీసీ రెందు సెక్షన్లుండేవి.ఈ గదిలో బి ఎస్ సీ మొదటి సంవత్సరంలో జగన్నాధరావు గారు సింబలిన్ నాటకం చెప్పేవారు. అలాగే మదనమోహనరావు గారు ప్రోజూ పారడైస్ లాస్టు రెండో పుస్తకం చెప్పేవారు. గుమ్మం పక్కనే అడ్దం గా వున్న బెంచిలో నేనూ రామారావూ ముద్దుక్రిష్ణా మరో ఇద్దరూ కూర్చునే వాళ్ళం. మా యెదురుగా వున్న బెంచిలో అమ్మాయిలు కూర్చునేవాళ్ళు. ఇద్దరు నరసమ్మలు బాగా గుర్తున్నారు. మిగిలినవాళ్ళు లీలగానే గుర్తున్నారు. దానికీ కారణం వుంది. జగన్నాధరావు గారు మదన మోహనరావు గార్ల క్లాసులు చల్లారిన నీళ్ళ టీ తాగుతున్నట్టే వుండేవి. దానితో ఆ క్లాసుల్లో చుక్కలాటలు, కబుర్లూ ఇత్యాదుల్లోనూ లేదా నాటకాలూ యెలక్షన్లూ. సాయంత్రం గ్రౌండులో చెయ్యబొయే పనుల గురించీ కాలం గడిచేది. సింబలిన్ నాటకంలో సోలెమ్న్ మ్యూజిక్ అని వచ్చినప్పుడల్లా టట్ట డడ్డఢాం అంటూ వాయించడం మామూలయిపోయింది. యీ గోలలోంచి యెప్పుడు తలెత్తి చూసినా సత్యవతి అనబడే బి ఎస్ యే నరసమ్మ నన్నే చూస్తూ వుండేది. నేనటు చూడగానే జి నరసమ్మ వైపు తిరిగి యేదో మాట్లాడుతుండేది. నేను అంతగా పట్టించుకునే వాణ్ణి కాదు కాని ఒక్ సాయంత్రం ఫిజిక్సు స్పెషల్ క్లాసు అయ్యాక జీ నరసమ్మ చీకట్లో పక్కకి వచ్చినట్టే వచ్చి అకస్మాత్తుగా ఒక ముద్దుపెట్టి పారిపోవడంతో గుర్తున్నారు. ఆ తరవాత మళ్ళీ ఆ అమ్మాయి నన్ను తప్పించుకునే తిరిగింది.

No comments: