Search This Blog

Monday, April 30, 2007

ఈ జ్ఞాపకాలు రాస్తుంటే నిజం గానే నా జీవితం ఇంత వర్ణభరితం గా గడిచిందా అనిపిస్తోంది. ఇంకా జీవితం మొదట్లోనే వున్నాను. మా అమ్మానాన్నా విజయనగరం సామాజిక జీవితం లో ప్రముఖులు గా వుండే వారు. అంచేత నాకూ పలువురు ప్రముఖుల పరిచయ భాగ్యం కలిగింది. ద్వారం వెంకటస్వామి నాయుడు గారు ఫిడేలు సాధన చేస్తున్న్నప్పుడు దాదాపు ప్రతి రోజూ అదే గది లో కూర్చుని వుండే అదృష్టం నాకు కలిగింది. అయితే కోహినూరు వజ్రం తో బాదం కాయలు కొట్టుకున్న గొల్లపిల్లవాడిలా నా భాగ్యాన్ని నేను గుర్తించలేదు. అలాగే అంట్యాకుల పైడిరాజు గారికీ వారి శ్రీమతి కీ నా మీద అవ్యాజమైన అభిమానం వుండేది. పైడిరాజు గారు నాకు చిత్రకళ గానీ శిల్పకళ గానీ నేర్పుదామని చాలా ప్రయత్నించారు. వారు ఒకసారి నా తల ఆకారాన్ని మృత్తికా శిల్పం లాగ చేసి ఇచ్చారు. నేను కూడా ఆయన బొమ్మ గీశాను. కానీ ఇవ్వడానికి మనసొప్పలేదు. దాన్ని చూసి ఆయనేమైపోతారో అని భయమేసింది. ఏమయితే అయిందని దాన్ని మా తెలుగు మాస్టారికి ఆయన బొమ్మే అని ఇచ్చేశాను.ఆయన నన్ను బెంచీ ఎక్కించారు. ఆ రకం గా నా చిత్రకళాభ్యాసం ముగిసింది

2 comments:

Anonymous said...

అందమైన అనుభవాలను ఇంకా అందంగా రాసారు :-)

రాధిక said...

ఎంత అదృష్టవంతులండి.